శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఏపీ మంత్రి రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల ధూళి దర్శనం చేసుకున్నారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మంత్రికి అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.