Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసే అంశంపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు.
ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నామని వెల్లడించారు. భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తామని చెప్పారు.
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేది తమ ఉద్దేశమని నారా లోకేశ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి.. నో ఆడ్మిషన్ బోర్డులు పెట్టాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుం రాష్ట్రంలో సుమారు వంద బడుల్లో అలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.