హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉన్న సీఎం కేసీఆర్కు ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ర్యాపిడ్ టెస్ట్లో నెగెటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫలితం గురువారం రానున్నది.