అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇవాళ మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు.గతంలో రెండుసార్లు ఆయన ఇదే విధంగా బాధపడు తూ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చికిత్సపొందారు.
సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ హజరైయ్యారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఛాతి నొప్పితో అస్వస్థతకు గురై కిందపడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు ఆయనను అమలాపురం లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.