అమరావతి : ఏపీలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Minister Buggana ) తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. నంద్యాల జిల్లా (Nandyal District)బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రి గ్రామానికి చేరుకున్నారు. మంత్రి వెంట అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు ఉన్నారు. ఓ చెట్టు వద్ద నుంచి పనులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు(Bees) వీరిపై దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు గాయాలు కాగా మంత్రి బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రిలో వైద్యం అందించి ఇంటికి పంపించారు.