అమరావతి: చంద్రబాబుకు (Chandrababu) మధ్యంతర బెయిల్పై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) స్పందించారు. బాబుకు బెయిల్ వచ్చింది నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించడం లేదని కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని సెటైరికల్గా ట్వీట్ చేశారు. స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐదు కండిషన్లు విధిస్తూ నవంబర్ 28 వరకు బెయిల్ ఇచ్చింది.
నిబంధనల్లో భాగంగా కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని తెలిపింది. రాజకీయ కార్యకరలాపాల్లో పాల్గొనకూడదని, హాస్పిటల్, ఇంటికే పరిమితంకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రూ.లక్ష పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, నచ్చిన దవాఖానలో సొంత ఖర్చులతో చికిత్సచేయించుకోవచ్చిన తెలిపింది. అయితే చికిత్స, దవాఖానకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కు సమర్పించాలని పేర్కొంది. కేసును ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ అవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
నిజం గెలిచి కాదు
బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్!— Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు (AP High court) ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరుచేసింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై సోమవారం విచారణ పూర్తి చేసిన కోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.