అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మాట్లాడుతూ..కొవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
2022 జనవరి నెలకు పెండింగ్లో ఉన్న ఐదుడీఏలతో కలిపి పాత జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.