అమరావతి : ఏపీలో ఇంటర్ పరీక్షలు(Inter Exams) మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సెట్ నంబర్ 1 ప్రశ్నపత్రం పరీక్షను నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు గాను ఇంటర్ బోర్డు(Inter Board) అధికారులు 1,559 కేంద్రాలను ఏర్పాటు చేయగా 57 సమస్యాత్మ కేంద్రాలను గుర్తించారు. మొదటి రోజు ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,73,058 మంది పరీక్షను రాయనున్నారు.
కాగా రేపటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ( Second Year ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4,88,831 మంది హాజరు కానున్నారు. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రెండేళ్లకు కలిపి 90,282 పరీక్షలకు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.