అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 15న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీన ఎగ్జామ్స్ ముగియున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 22న ఎతిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 24న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.