Maoists | అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని సతీమణి మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
ఛత్తీస్గఢ్లోని పరిణామాలతో మావోయిస్టులు ఏపీకి రావాలని చూస్తున్నారని మహేశ్ చంద్ర తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలిలకపై ఇంటెలిజెన్స్ నుంచి రెండు రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చిందని చెప్పారు. మావోయిస్టులు ఏపీ నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6.30-7.00 గంటల మధ్య భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా, ఆయన సతీమణి సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారని పేర్కొన్నారు.
అలాగే ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని మహేశ్ చంద్ర తెలిపారు. అరెస్టయిన వారిలో 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ అనుచరులుగా గుర్తించామని వెల్లడించారు. మిగిలినవారంతా సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులు అని పేర్కొన్నారు.
కాగా, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట భారీ ఆపరేషన్ చేపట్టి, ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉండటం సేఫ్ కాదని భావించిన మావోయిస్టులు ఏపీకి షిఫ్ట్ అయ్యేందుకు ట్రై చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 26న ఏవోబీలోకి ఎంటరైన హిడ్మా టీమ్.. విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలో మకాం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 31 మంది మావోయిస్టులను విజయవాడ శివారుల్లో పోలీసులు అరెస్టు చేశారు.
ఏకే 47 – 2
పిస్టల్ – 1
రివాల్వర్ – 1
సింగిల్ బోర్ ఆయుధం – 1
ఎలక్ట్రిక్ డిటోనేటర్లు – 1525
నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు – 150
ఎలక్ట్రికల్ వైర్ బండిల్ – 1
కెమెరా ప్లాష్ లైట్ – 1
కటింగ్ బ్లేడ్ – 1
ఫ్యూజ్ వైర్ – 25 మీటర్లు
కిట్ బ్యాగులు – 7