అమరావతి: కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన “పీఎం గతిశక్తి వర్చువల్ సదస్సు”లో ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీ.కే సింగ్,కేంద్ర రవాణ, రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ ఆరమనే,అదనపు కార్యదర్శి అమిత్ కుమార్ గోష్,కేంద్ర సరకు రవాణా ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా, అండమాన్ నికోబర్,ఆంధ్రప్రదేశ్,కేరళ,లక్ష్యద్వీప్, మహారాష్ట్ర,పొదుచ్చేరి. తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.
“గతిశక్తి”ని అమలుపరచడంలో సంబంధిత శాఖల మంత్రులు, పారిశ్రామికవేత్తల ద్వారా పానెల్ ల వారీగా చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసే దిశగా పీఎం గతిశక్తిని తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం గత నెల వెస్ట్ జోన్ సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో నిర్వహించిన ఈ సదస్సు ద్వారా సలహాలు స్వీకరించనున్నది కేంద్రం. ఈ సదస్సులో ముందుగా పీఎం గతిశక్తికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలు, కలిసి ముందుకు సాగాలని కేంద్ర రవాణాశాఖ కోరింది.