అమరావతి: డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ హోంమంత్రి సుచరిత. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుంచి వర్చువల్ విధానంలో ఆమె పాల్గొన్నారు. మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు. మంగళగిరి 6 వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులుమొక్కలు నాటారు. అన్ని బెటాలియన్ లలోని దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో పోలీసు కుటుంబసభ్యులు, స్కూల్ విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.