అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు (IRR) కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఐఆర్ఆర్ అలైన్మెంటులో అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈ నెల 23కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరుచేసిన విషయం తెలసిందే. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. అయితే నవంబర్ 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.