మంగళగిరి: కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇన్ఛార్జ్ సీపీ ఈ కేసులో విచారణకు హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు.
విచారణ అనంతరం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ఎన్నికను బుధవారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నిక జరిపేలా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కూడా విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితం ప్రకటించకుండా వివరాలు హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.