Deputy CM | ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని విచారణ సందర్బంగా ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ దృష్టితో ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారని అభిప్రాయపడింది. ఈ మేరకు పిల్ను డిస్మిస్ చేసింది.
చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు ఈ పిటిషన్ను దాకలు చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చే వరకు కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్తో పాటు వ్యక్తిగత హోదాలో పవన్ కల్యాణ్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.
ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సమాజానికి మేలుచేసే విధంగా, నిజమైన ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించిన వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. రాజకీయ లక్ష్యాలతో కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు మంచివి కాదని హెచ్చరించింది.