హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాజధాని ఫైల్స్ సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసుకునేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించామని చెప్పిన సెన్సార్ బోర్డు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు స్టే విధించింది.
శుక్రవారం మరోసారి విచారణ జరుగగా, స్టేను ఎతివేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీలో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.