అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలకు చెందిన 12 మంది నాయకులు మధ్యాహ్నాం 2.15 నిమిషాలకు హైకోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం , ఉద్యోగుల మధ్య సమస్య జఠిలం కాకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాల నేతలను విచారణకు పిలిచామని కోర్టు స్పష్టం చేసింది .
ఏపీ పీఆర్సీపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ ప్రారంభం కాగా ప్రభుత్వం, పిటిషనర్ల మధ్య జరిగిన వాదనల తరువాత హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. పీఆర్సీ నివేదికను బహిర్గత అంశామని ప్రభుత్వంతో తేల్చుకోవాలని సూచిస్తునే సమ్మెకు వెళ్లనున్న ఉద్యోగ సంఘాలు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిలవ్వడం చర్చంశానీయంగా మారింది.