TTD EO : కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. నెల రోజుల పాటు జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.
అయితే.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈవో అమలు చేయకపోవడంతో ముగ్గురు ఉద్యోగులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుచేయలేదని వాళ్లు ఈవోపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. ఉద్యోగుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అతనికి జైలు శిక్ష, జరిమానా విధించింది.