అమరావతి : ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సక్రమంగా వాడుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర పథకాలకు సొంతపేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేయగా వాటిని పూర్తి చేయడంతో నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులిస్తే ఏపీకి అసలు రాజధానే లేకుండా చేశారని దుయ్యబట్టారు.