అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై సీఎం జగన్ కూడా విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేయాలని అధికారులకు ఆదేశించారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్కు ఆదేశించారు.
ఈ సంఘటన మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని జంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలియజేశారు.