అమరావతి : గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించారు.
ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టన, మహాసంప్రోక్షణలో గవర్నర్తో పాటు మంత్రి సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో శిలాఫలకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.
నూతన ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన శంఖుచక్ర నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అదేవిధంగా, ఆలయ ప్రాకారం, ఆలయ విమానం, గోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆర్జీడీ లైటింగ్ ఏర్పాటుచేశారు. ఆలయం ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరణలు చేపట్టారు. ఇందుకోసం రెండున్నర టన్నుల పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్లు వినియోగించారు.