Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న వారికి నంద్యాల జిల్లా కలెక్టర్ మునజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీరారెడ్డి హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. భ్రమరాంబ అతిధి గృహం వద్ద గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
గంగాధర మండపం నుండి ఆలయ ప్రవేశం చేసిన గవర్నర్ దంపతులకు శ్రీకృష్ట దేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న, చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే తిలక ధారణ చేసి స్వాగతం పలికారు. స్వామివారి గర్బాలయంలో శ్రీభమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు అభిషేకం బిల్వార్చన చేయించారు.
అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు అందుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జలం, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీశైల మహా క్షేత్ర విశేషాలను తెలుసుకున్న ఆయనకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.