అమరావతి : ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేసే పరిస్థితికి రావడం ప్రభుత్వానికే సిగ్గు చేటని ఆయన అన్నారు. శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్లో పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ నిరసన నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో పీడీఎఫ్కు చెందిన ఎమ్మెల్సీలు ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన చేపట్టారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా.. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని బండి శ్రీనివాస్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.