అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు వార్షిక బడ్జెట్ను (Budget) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉంటుందని సమాచారం.
ఇందులో వ్యవసాయం, వైద్యారోగ్య, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్లో నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించనున్నారు.
మరికాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశమవనుంది. వార్షిక బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. అనంతరం మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతారు.