జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వన్ ప్లస్ వన్ ఉన్న భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్కి పెంచింది. కొడాలి నానికి టూ ప్లస్ టూ ప్లస్ కు అదనంగా వన్ ప్లస్ ఫోర్ గన్మెన్ల భద్రతతోపాటు ఆయన కాన్వాయ్లో అదనంగా మరో భద్రత వాహనాన్నికేటాయించారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనంగా త్రీ ప్లస్ త్రీ గన్మెన్లతో భద్రత కల్పించారు.
చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని పెంచింది జగన్ సర్కారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్లకు భద్రత పెంచింది అక్కడి ప్రభుత్వం.