AP News | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాప్ నెట్ ( సొసైటీ ఫర్ ఏపీ నెట్వర్క్)ను మూసివేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్కు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది.
ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శాప్ నెట్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఆ తర్వాత ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ శాప్నెట్ను అలాగే కొనసాగించింది. కానీ ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం శాప్నెట్ను మూసివేసింది. శాప్ నెట్కు బదులు విద్యామండలి నుంచే సమర్థవంతంగా సేవలు అందించాలని నిర్ణయించింది.