అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహర్రం సెలవు దినాన్ని మరో రోజుకు మార్పు చేసింది. ఈ నెల 19వ తేదీకి బదులు 20న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీని ఖరారు చేసినట్లు సర్కారు పేర్కొంది. ఈ నెల 20న సాధారణ సెలవు ప్రకటిస్తూ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది.