చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు (Narayana) ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు పట్టణ నాలుగో మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన మేజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్కు నిరాకరించారు. ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నిన్న మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో అరెస్టు చేశారు. అనంతరం మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తి ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని పేర్కొన్నారు.
ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని తన నివాసంలో మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం ఆయనను ఏపీలోని చిత్తూరుకు తరలించారు. గత నెల 27న తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్లో సర్క్యులేట్ అయినట్టు చిత్తూరు వన్టౌన్ ఠాణాలో నమోదైన కేసులో నారాయణను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి వెల్లడించారు.