అమరావతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పొట్టి శ్రీరాములు తాగ్యఫలం, అనేకమంది పోరాటాల ఫలితంతో ఏర్పాటైన ఏపీ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.