టెన్త్ పేపర్ లీకేజీలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి నారాయణపై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందంటూ ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ నిన్ననే నమోదు చేసినట్లు సమాచారం.
అయితే ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5 అంజనీ కుమార్, ఏ6 హెరిటేజ్ ఫుడ్స్ను చేర్చారు. ఇలా మొత్తం 14 పేర్లను ఏపీ సీఐడీ చేర్చింది.
అమరావతి ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక.. వీరిపై 120 బీ, 420, 34,35, 36,37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.