AP DSC Notification | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264,పీజీటీలు 215, ప్రిన్సిపల్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
డీఎస్సీ పరీక్ష నిర్వహణకు ఈ నెల 21 నుంచి ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 5 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నారు.
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఏప్రిల్ 1న స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ , ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. CSE.APGOV.IN వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ఠ పరిమితి 44 ఏళ్లు కాగా..రిజర్వ్ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్ల గడువు పెంచారు.