అమరావతి : ఏపీలో ఒకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ (Double engine sarkar) పనితీరు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయరెడ్డి(Vijayasai reddy) బీజేపీ, కూటమి పార్టీలపై ట్విటర్లో ఆరోపించారు. 2014-18లో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారే ఉందని గుర్తు చేశారు.
వారి పాలన వల్ల ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై కక్షపూరిత విధానాలు అవలంభించిందని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ(Rural Economic) దెబ్బతిందని ఆరోపించారు. నాడు టీడీపీ, బీజేపీలు రెండు వేర్వేరూ వ్యతిరేక దిశల్లో పనిచేయడం వల్ల అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. వారి పాలన ఒకే జిల్లా, ఒకే కులం, ఒకే కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.