ఏపీ హోంమంత్రి తానేటి వనితతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. నూతనంగా హోంశాఖ బాధ్యతలు చేపట్టిన కారణంగా, మర్యాద పూర్వకంగానే మంత్రిని కలిసినట్లు డీజీపీ వివరించారు. ఈ సందర్భంగా పూల బోకే ఇచ్చి, మంత్రి వనితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. అయితే ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను కచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అలాగే పీఎస్లోకి కచ్చితత్వం ఉన్న కేసులు వస్తే, వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పోలీసులు చూడాలని హోంమంత్రి ఈ సందర్భంగా డీజీపీకి సూచించారు. ఇక.. క్రైం రేటు తగ్గించడం, నాటుసారాను అరికట్టడంపై కూడా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వైజాగ్ ప్రాంతంలో గంజాయి సాగు, దాడుల అంశం కూడా చర్చకు వచ్చిందని ఏపీ డీజీపీ వెల్లడించారు.