అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన కేంద్ర సర్వీస్లోకి వెళ్లనున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈరోజు డీజీపీని బదిలీ చేయడం వెంటనే ఇంటెలిజెన్స్ విభాగంలో డీజీగా పనిచేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించడం చకచకగా జరిగిపోయాయి. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గౌతం సవాంగ్ 2019 మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు ఇంకా సర్వీసు ఉండగా ఆకస్మత్తుగా బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం గౌతం సవాంగ్కు పోస్టింగ్ ఇవ్వకుండానే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం ఏపీ పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. బదిలీ విషయం తెలియగానే ఏపీ సీఎం జగన్ను గౌతం సవాంగ్ కలిశారు. రిలీవైన కొద్ది గంటల్లోనే ఆయన కేంద్ర సర్వీస్లోకి బదిలీ అయ్యారు.