ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఒకటి రెండు సంఘటనలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అనడం ఏమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతలు కూడా లోపించాయని చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గానే డీజీపీ పై వ్యాఖ్యలు చేశారు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని డీజీపీ కోరారు. కొన్ని కేసుల్లో కేవలం 10 రోజుల్లోనే విచారణ చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ట్రయల్స్ కూడా జరుగుతున్నాయని డీజీపీ మాజీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసింగ్ ప్రమాణాలను పెంచేందుకు చూస్తున్నామని, ఈ యాప్ ద్వారా నేరుగా మహిళలతోనే సంప్రదించేందుకు వీలు కల్పిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. గంజాయి కట్టడికి కూడా చర్యలు చేపడుతున్నామని డీజీపీ గుర్తు చేశారు.