Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా పదకొండురో రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా పట్టు వస్ర్తాలు, ఫలపుష్పాదులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఆ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, ఈవో పెద్దిరాజు దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుతోపాటు అధికారులు, ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి మార్కండేయశర్మ పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్ర్తాలను సమర్పించారు.