AP Dy CM Kottu | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న కొట్టు సత్యనారాయణ దంపతులకు అర్చక వేదపండితులు తిలకధారణ చేసి ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏఈవోలు మోహన్, హరిదాసులు పూలమాలతో స్వాగతం పలికారు.
స్వామివారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చనలు, పరివార దేవతలకు కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.