అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కరోనా బారీన పడ్డారు. పాజిటివ్ గా తేలడంతో ఆయన ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని, గతంలో కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు, నారాలోకేష్, నేత దేవినేని ఉమా కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికార పార్టీలు, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు.