Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలో విషాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సీఎంవో, సచివాలయ అధికారులను ఆదేశించారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొంటున్న తెలుగు వారి కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. అమర్నాథ్లో కుంభవృష్టి కురుస్తుండటంతో అకస్మికంగా పోటెత్తిన వరదలకు ఇప్పటివరకు 13 మంది మరణించగా, పలువురు గల్లంతైన సంగతి తెలిసిందే.
అమర్నాథ్ యాత్రలో పాల్గొంటున్న తెలుగు వారి ఆచూకీ, వారి బాగోగుల కోసం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ అదనపు కమిషనర్తో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదించారు. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్కు వెళ్లి.. సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఏపీ భవన్ అదనపు కమిషనర్ను ఏపీ సీఎంవో అధికారులు ఆదేశించారు.