అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ లో చేరారు. ఈ యాప్ యూజర్లకు వారి మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి చేరడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధికారిక అకౌంట్లను “కూ” యాప్ లో ఓపెన్ చేశారు. @Ysjagan హ్యాండిల్ ని ఉపయోగించి, జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో తెలుగు ,ఇంగ్లిష్ భాషల్లో సంభాషిస్తారు. వారి”కూ” ప్రొఫైల్ నుంచి ఇటీవల పోస్ట్ లో ఓ వీడియో నుషేర్ చేశారు. అందులో వారు ఆసుపత్రులను నిర్మించాల్సిన అవసరాన్ని తెలియజేసారు.
యూజర్లు https://www.kooapp.com/profile/ysjagan లో కనెక్ట్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు, ఇంగ్లిష్ లో ప్రభుత్వంతో సంభాషించాలనే ముఖ్య ఉద్దేశంతో “కూ” యాప్ లో ముఖ్యమంత్రి అకౌంట్ ను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ శాఖలకోసం “కూ” అకౌంట్లు తెరిచారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ “కూ ” యాప్ వేదికగా ఉపయోగపడనున్నది.
“కూ” యాప్ వ్యవస్థాపకుడు , సీఈఓ రాధాకృష్ణ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వాగతిస్తూ, “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని “కూ” యాప్ కి స్వాగతిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు వారి ఫాలోవర్స్ అందరికీ అందుబాటులో ఉండేందుకు వారి ఆలోచనలు ,అభిప్రాయాలను రోజూ సులభంగా వాళ్ళతో పంచుకునేందుకు “కూ” యాప్ సహాయపడుతుంది” అని ఆయన తెలిపారు.
ప్రజలు తెలుగుతో పాటు “కూ” అందించే ఇతర భాషలలోని వ్యక్తులతో సంభాషించవచ్చు. ఇటీవల నటులు తనికెళ్ల భరణి, ఎల్బి శ్రీ రామ్, నటీమణులు ఈషా రెబ్బా, అనుష్క శెట్టి, విజయశాంతి, నటుడు నాగ శౌర్య లు కూడా “కూ” యాప్ లో చేరారు.