అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డితో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై సీఎం చర్చించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెం బర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ విషయంపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాలకు అనుమతులు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. వినాయక మండపాలకు పోలీసులు ఆంక్షలు విధించడంపై బీజేపీతో పాటు పలు ధార్మిక సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వివిధరూపాల్లో తమ ఆందోళనలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు.ఈ విషయంపై కూడా సీఎంకు డీజీపీ వివరించారు.