అమరావతి : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడి ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కాగా ప్రభుత్వం ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంఓకు వైద్యారోగ్య శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది . శాఖాపరంగా దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది .
ఇదివరకే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఫిర్యాదుకు సకాలంలో స్పందించని సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసరావును సస్పెన్షన్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు నిందితులకు చెందిన సెక్యూరిటీ, ఫాగింగ్ ఏజెన్సీలకు టర్మినేషన్ నోటీసులు జారీ చేశారు.