తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 2.50 లక్షలు ముద్రించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు .
శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించిం ది. క్యాలెండర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.