తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను ట్విట్ చేశారు. కష్టపడి పనిచేస్తూ ఉండటమే గొప్ప ఆస్తి అని రాశారు. కూలీల సహకారం లేకుండా అభివృద్ధి లేదన్నారు. ఈ సందర్భంగా కష్టపడి పనిచేస్తున్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.