అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేయించారు. అనంతరం జగన్ మాట్టాడుతూ.. పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుటుంబ సభ్యులు, పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.