అమరావతి : ఏపీ సీఎం జగన్ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏండ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1,2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1,2018 నుంచి అమలు చేయనున్నారు. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1,2020 నుంచి అమలు కానుంది.