అమరావతి: ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు అన్న ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అమ్మ ఒడి పథకం మూడో విడతను విడుదల చేయనున్నారు. అదే రోజు శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు నాలుగు లేన్లుగా నిర్మించే విస్తరణ పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందు సీఎం కార్యక్రమ సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం శ్రీకాకుళం చేరుకున్నారు. అధికారులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి ఆయన పరిశీలించారు. శ్రీకాకుళంలో సోమవారం ఉదయం 11 గంటలకు అమ్మ ఒడి పథకం మూడో విడత పథకం లబ్ధిదారులు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
కాగా, ఇటీవలి తిత్లీ తుపాను, వంశధార ప్రాజెక్టు కింద నష్టపరిహారం పొందుతున్న లబ్ధిదారులను కూడా ముఖ్యమంత్రి కలుసుకోనున్నారు. వారి సమస్యలను ఆలకించి వారికి మరింత మౌలిక సదుపాయాలను కల్పించడంపై అధికారులతో జగన్ చర్చించనున్నారు. జగన్ పర్యటనను పురస్కరించుకుని శ్రీకాకుళం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేయడంపై దృష్టి సారించారు. ఒడిశాలో ఇటీవల మావోయిస్తుల కాల్పులను దృష్టిలో ఉంచుకుని జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు.