అమరావతి : సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.
ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఘన నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు పూలే అని అభివర్ణించారు.