అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో 15 నిమిషాల పాటు వివిధ అంశాలతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, వాటికి నిధులను విడుదల చేయాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్ల నిర్మాణాలకు, వంతెనలను నిర్మించాలని కోరినట్లు సమాచారం . అనంతరం జగన్ ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలు దేరారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీని ఆర్థికంగా సహాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు సంవరించిన అంచనాలు, రేషన్ పెంపుదల, భోగాపురం ఎయిర్పోర్టుకు అనుమతులు తదితర అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.