అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో రోడ్లని అస్తవ్యస్థంగా తయారయ్యాయని, రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్ అంబ్ బీ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు. రోడ్ల నిర్మాణానికి రూ.2,205 కోట్లను కేటాయించామని, రాష్ట్ర చరిత్రలోనే ఇంత డబ్బు ఎన్నడూ కేటాయించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మే చివరి నాటికి రోడ్లు నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారు మండిపడ్డారు. వీటిని పూర్తిచేయడానికి సుమారు రూ.571.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు డిజైన్లోపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి-భోగాపురం తిరిగి జాతీయ రహదారి-16కు అనుసంధానం అయ్యే బీచ్ కారిడార్ రో డ్డు నిర్మాణం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలని ఆదేశించారు.